24, మార్చి 2009, మంగళవారం

మనసు -స్పందన

నా మనసు లోని స్పందనను మంచి మనసున్న వారికి చెపితే వారి స్పందన ఎలా ఉంటుందో మరి !
భూమి పై పుట్టిన ఏ ప్రాణి అయిన సరే తన దేహాన్ని భూమి పై వదలవలసిందే గదా ! మరి మనసు మాత్రం
మనము పోయిన తర్వాత భగవంతుని చేరుతుంది అంటారు.చూడండి ....ఎవరు అయిన దగ్గరవారు కనిపిస్తే
వాళ్ళు తో ఉన్నా ప్రేమ అభిమానం /లేదా ఈర్ష్య ద్వేషాలూ తో మనసు స్పందిస్తుంది.తల్లి ని చూస్తే ఒక రకం గాను ,
కుమార్తె /కుమారుని చూస్తే మన మనసు మరొక విధం గాను పులక రిస్తుంది.చిన్న పిల్లలను చూస్తే ..మనసు ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటుంది లేదా ఎత్తుకోవాలని అనిపిస్తుంది. అదే దైవం ని చూస్తే భక్తి భావం తో మనసు నిండి
ఉంటుంది . మనసు లో ఏదైనా భావమేర్పడితే ...మనసు వెంటనే అక్కడకు చేరుకుంటుంది .సంతోషం గా ఉన్న మనసుకు ఏదైనా భాధ వస్తే ఒక్కసారిగా మనసు మారి పోతుంది .మనసు ఒకోసారి ద్రవిస్తుంది మరొకసారి
క్షోభిస్తుంది .ఒక మనసు తల్లి ని కౌగలించు కున్నప్పుడు ఒక రకం గా స్పందిస్తుంది .అదే మనసు కూతరుని దగ్గరకు
తీసుకున్నప్పుడు వేరోకరకం గా , అదే భార్య తో కలిసినప్పుడు ఇంకో రకం గా మనసు స్పందిస్తుంది. చూసారా .........
దైవం తయారు చేసిన మనసు యెంత గొప్పదో. అందుకనేమో మనము మనసు చెప్పిన విధం గా నడుచుకుంటాము .
మనసు ఎప్పుడు సంతోషిస్తోందో తెలుసా .... కష్టం లో ఉన్నవారికి ఆదుకున్నప్పుడు ,దానం చేసినప్పుడు ,న్యాయం
చేసినప్పుడు ,తల్లి తండ్రులను గౌరవించి నప్పుడు , మన సాంప్ర దాయాలను నిలబెట్టి నప్పుడు ,దైవ పూజలు /భజనలు
దైవ కార్యక్రమాలు లో పాల్గొనప్పుడు మొదలగు మంచి పనులు చేసినప్పుడు మనసు ఎంత సంతోషిస్తుందో కదా .
మరి మనసు సంతోష పడితే ,దైవం గూడా ఆనం దిస్తాడు .ఎందుకంతే మనసు దైవం ది కదా !
అటువంటి మనసును చెడు పనులతో పాడు చెయ్యకండి . దైవం కు దూరం కాకండి .మంచి పనులు చేసి దైవం లాటి
మంచి మనసులతో ఆనందం గా /ఆరోగ్యం గా ఉండండి .మంచి మనసుకు మంచి రోజులు.
మనసును కలుషితం చేయకండి ........దయతో ఆలోచించండి ....ప్లీజ్ సర్/అమ్మ/అన్దరకూ .......
మనస్సాంతి అందరకు కలగాలని దైవాన్ని కోరుకుంటూ ......
తిలక్ పండ్రంగి .

23, మార్చి 2009, సోమవారం

తల్లి తండ్రుల బాధ్యతలు

భార్యా భర్తలు వారి మంచి ప్రవర్తనలు వల్ల ,ఒకరినొకరు అర్ధం చేసుకోవటం వల్ల ,ఒకరి అభి రుచిలు మరొకరు అర్ధం చేసుకోవటం
వల్ల , ఆర్ధిక నిర్ణయాలు మంచి వాతావరణం లో చర్చించుకోవటం వల్ల వారి జీవితం ఆనందం గా ఆరోగ్యం గా సాఫీ గా
సాగుతుంది .ఒకరి బంధువులను వేరొకరు గౌరివించుకోవటం వల్ల గూడ ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది.
ఇద్దరూ ఆడంబరాలకు పోకుండా అన్యోన్యంగా, అవసరాలకు మించి ఖర్చులకు పోకుండా ఉంటే వాళ్ల జీవితాలు సుఖ
వంతమౌతాయి. ఒకరిపై నొకరు నమ్మకం ఉంచుకొని వారి జీవితాలను అర్ధ వంతం గా ,ఫల వంతంగా చేసుకోవాలి.
వారికి పిల్లలు కలిగిన తర్వాత వారి వైవాహిక జీవితం రెండవ మలుపు లోకి తిరుగుతుంది.బాధ్యతలు పెరుగుతాయి.
మొదట తల్లి కి పిల్లల పై బాధ్యత ఎక్కువ అవుతుంది.వాళ్ళకు పోషక ఆహరం, తల్లి ప్రేమ ,తండ్రి ప్రేమ ,
రామాయణ , మహాభారత కథలు వాళ్ల వయసును బట్టి చెప్పటం, వాళ్ళు అభిప్రాయలు ఒక స్నేహితురాలుగా విని
వారికి సరి అయిన సలహా ప్రేమతో చెప్పాలి. అలాగే వారిని చక్కగా ఆడించాలి.వారిని చిన్న వయసులో దగ్గర ఉండి
చదివించాలి.వారికి స్కూల్ కి వెళ్ళేటప్పుడు వల్ల షూస్ శ్రద్దగా తుడిచి (పురుగు లు లేకుండా) సాక్స్ ని ఎప్పటికప్పుడు
ఫ్రెష్ గా రెడీ చేయాలి (స్కిన్ దేసుఅసే రాకుండా ). వాళ్ల లంచ్ boxes లో vitaminised భోజనం పెట్టి పంపాలి.
మంచి ద్రెస్సెస్ తో (ఉన్నంతలో )పంపి , మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు బాక్స్ యెంత తిన్నారో గమనించాలి.
అప్పుడప్పుడు వాళ్ళ మనస్తత్వం అర్ధం చేసుకోవాలి. పిల్లలను అందర్నీ సమానంగా చూడాలి.తండ్రి పిల్లలను వాళ్ళకు
కావలసిన అవసరలును చూడాలి.తల్లి తండ్రులు పిల్లలకు మంచి సంస్కారం ,మన సాంప్రదాయాలు నేర్పాలి.
క్రమేపి పెద్ద అవుతున్న పిల్లలను , వాళ్లు చేసే పనులు, వాళ్ళ స్నేహితులు ను గమనిస్తూ ఉండాలి.అప్పుడప్పుడు
స్కూల్/కాలేజి కి వెళ్లి పిల్లలు గురుంచి వారి ప్రవర్తన/వారి చదువు గురుంచి పాఠ శాలా /కాలేజి యాజమన్యాలుతో
sampradistuu ఉండాలి .వీలైనప్పుడు పిల్లలను భందు మిత్రుల ఇంటికి వెళ్లి సరదాగా గడపాలి.దీని వల్ల పిల్లలకు
అందరితో కలుపుగోలుతనం ,ప్రేమతో సంభాషించటం తెలుస్తూంది.తండ్రి తన సంపాదనలో పిల్లల గురుంచి ,తమ
భవిష్యత్తు గురుంచి కొంత సేవ్ చేయాలి. తల్లి తండ్రులు క్రమ శిక్షణ లతో జీవిస్తే , పిల్లలు గూడ తప్పక తల్లి తండ్రులను
anukaristaru. పిల్లలు ku talli tandrulu వారి ఆదాయం , వారు పిల్లల పై ఉంచుకున్న గోల్స్ వాళ్ళకు
చెప్తూ ఉండాలి. అల్లాగే వాళ్ళ ఇష్టాలు ను కూడా గౌరవించాలి.ఎప్పుడైతే తల్లి తండ్రుల పెంపకం ,చక్కటి సాంప్రదాయలు తో సంస్కరమంత మైన పెంపకం జరుగుతుందో తల్లి తండ్రులు కొంతవరకు తమ బాధ్యతలు నిర్వర్తినట్లు గా అనుకోవచ్చు.అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళటం,ఇంటి నుండి పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తల్లి తండ్రులకు
అబద్దం చెప్పకుండా వెళ్ళటం నేర్పాలి.వీలైనంత వరకు పగలు గాని రాత్రి గాని అందరూ కలిసి భోజనం చేయాలి.
పిల్లల ముందర తల్లి తండ్రులు కోప తాపాలు ప్రదర్శించ కూడదు.ఇవి తప్పకుండ పిల్లల మీద ప్రభావం చూపుతుంది.
అలాగే వారి వివాహ సమస్య .సరి అయిన కాలం లో మంచి కుటుంబం లో నుంచి పిల్లలకు వివాహం చేస్తే మంచిది .
దీనికి ముందర పిల్లలు స్తిర పడాలి వాళ్ళ జీవితం లో. వాళ్ళ వివాహ జీవితం గురుంచి పిల్లకు మంచి /చెడు తల్లి తండ్రులు ఖచ్చితం గా చెప్పి ఒప్పించాలి. కాని వాళ్ళ ఇష్టాలకు తప్పని సరైతే తప్పక అంగీకరించాలి.పిల్లలు పెద్దవారైన తర్వాత ,జీవితం లో settele అయిన తర్వాత తల్లి తండ్రులు స్నేహితులు గ ఉండాలి. తల్లి పిల్లలకు దైవం అయితే
తండ్రి మాత్రం ఒక కుటుంబానికి ఛత్రం లాటి వాడు.తల్లి పిల్లల గురుంచి తనకు లేకపోఇన ,తన జీవితాన్ని పూర్తిగా
లైఫ్ ending వరకు సేల్ఫలేస్స్ గ sramistundi. ఇంక తండ్రి పిల్లల గురుంచి తన కడుపు కట్టుకొని ,పిల్లల గురుంచి
జీవితాంతము శ్రమ పడే త్యాగ నిరతి ఉన్న ఒక త్యాగి.పిల్లలు తల్లి తండ్రుల ను అర్ధం చేసుకొని వాళ్ళను ప్రేమిస్తే
వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలా లేని నాడు తల్లి తండ్రుల జీవితాలు భాధాకరం.

డియర్ children -మీ తల్లి తండ్రులను ప్రేమించండి .ఆదరించండి .వాళ్లకళ్ళల్లో ఆనందాన్ని ఆస్వాదించండి .
మీ నుంచి వారు ఏమి ఆశించారు. మీ పిల్లలు గూడ మిమ్మల్ని ఆదరిస్తారు.
ప్రేమించండి ..ప్రేమించ బడండి .ప్లీజ్.......
తిలక్ పండ్రంగి

తల్లి తండ్రుల బాధ్యతలు

పూర్వం

దైవ ప్రేమ

పై శీర్షిక గురుంచి అర్ధం తెలెయని వారు ఎవరూ ఉండరు .దైవం శ్రిష్టి యెంత గొప్పది. అసలు జీవరాసి ని శ్రుష్టి o చే

ముందర , ప్రక్రుతి ని shrushTiee క రించాడు .ఎందుకంటె జీవరాశిని శ్రుష్టి o చే ముందర జీవరాశికి కావలసిన

తిండి , నీరు మొదలగు అవసరాలను అందించాడు . అసలు జీవి ని తయారు చేసేటప్పుడు దైవం నోటి దగ్గరకు

వచ్చి,"అవునూ -ఈ నోటికి తిండి రెడీ చేయాలి" కదా అని జీవి మూతికి మేత ను రెడీ చేసాడుట. చూడండి......

జీవికి ఆకలి తీర్చటం కొరకు దైవం ముందుగా నే తిండి ని రెడీ చేసాడు .మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మనమే

కాదు ఏ జీవి అయిన తల్లి తీసుకొనే ఆహారం బిడ్డకు అందేలా చేసి మనం భూమి మీద కు వచ్చేటప్పటికి తల్లి కి

తన స్తనముల నుంచి పాలను వచ్చే ఏ ర్పాటు చేస్తాడు. ఆలా గే దైవం - బిడ్డ కు శ్వాస ,శరీర నిర్మాణం లో ఎంతగానో
శ్రమిస్తాడు.తల్లిని బిడ్డ గుర్తించే విధమ్ గ చేస్తాడు. బిడ్డ కు ఆకలి వచ్చినప్పుడు ఏడుపు ద్వార వ్యక్త మైనట్లు , అలాగే
తల్లికి బిడ్డ ఆకలి టైం కి పాలు స్రవించే టట్లు దైవం సహాయo చేస్తాడు. మనుషుల కే కాదు ..జంతువుల ను కూడా
ప్రేమ తో పాలిస్తున్నాడు .బిడ్డలు కూడా వాటి తల్లులను గుర్తించే విధమ్ గ చేస్తాడు. పక్షి జాతి ని చూడండి .....
అవి గుడ్లు పెట్టే సమయానికి ముందుగా నే వాటికి ఒక గూడు కట్టటానికి సహాయ పడతాడు. గుడ్లను పెట్టిన
పక్షి అది జాగ్రత్తగా తన బరువు పడకుండా పొదగటం కి , అది పొందే ఆనందానికి సహాయ పడతాడు .చక్కటి
వాతావరణం కలిగిస్తాడు. అలాగే జీవులకు కావలసిన ఆక్సిజన్ ని తను సృష్టించిన వృక్ష సంపద నుంచి ఇచ్చి
కాపాడుతున్నాడు.ఎన్ని కాలాలు మారిన సూర్య చంద్రులు వారి చర్యలు మారకుండా చూస్తున్నాడు.భూమి
తన భ్రమణం ఆగ కుండ చేస్తాడు. అల్లాగే భూమి ఆకర్షణ తగ్గకుండా చూస్తున్నాడు.మన శరీరం లో ప్రవహించే
రక్తం ను తయారు చేస్తున్నాడు. ఎవరి మనసులో ఏముందో ఇతరులకు తెలయకుండా తన మహిమను చూపిస్తున్నాడు.నోటి తో నే తిండి తినేటట్లు అలాగే విసర్జన ఏర్పాటు విడివిడిగా చేసాడు.తన శ్రుష్టి ని నాగరిక
మనవుడు చేయగలడా. నిప్పును పైకి ఎగిసేటట్లు, నీరు పల్లంకి ప్రవహించేటట్లు చేసాడు.మంచి మనసు తో
మనల్ని తయారు చేసాడు.మంచి రక్తంతో మనల్ని శ్రుష్టించాడు . అయన దృష్టి లో అందరూ సమాన మే .
కాని మనం ఏమి చేస్తున్నాం. దైవం మనకు ఇచ్చిన జన్మను ద్వేష /స్వార్ధ పూరిత వాతావరణం గ కొంతమంది
కలుషితం చేస్తున్నారు.చెడు రాజకీయాలు చేస్తున్నారు.బిడ్డలకు మంచి ఆహారాన్ని ఇవ్వకుండా చాల మంది
దారి తప్పుతున్నారు .దైవం ని మరచి మత్తులో కొందరు చేరుతున్నారు.సాంప్రదాయాలు గాలికి వదులుతున్నారు.
దైవం తనకంటూ ఏమీ అడగ లేదు కదా. మంచి మనసుతో అందరూ కలిసి మెలిసి జీవించండి అన్నారు. మనం
మాత్రం ................ ఏం చేస్తున్నాం. కలుషితమైన ఆహరం, నీరు, తయారు చేసుకొని తింటున్నాం.దైవ ప్రార్ధన
చేయటం తగ్గించాము .దైవం యెంత మంచి వాడంటే ---శివుడు భక్తులను "మీరు సువాసనలు గల పుష్పాలు మీరు
తీసుకొని నాకు ఉమ్మెత్త పూలూ ,ఆకులూ లాటివి సమర్పించు.అలాగే పాలు నువ్వు తీసుకొని నాకు నీరు అభిషేకించు .రత్నాలు , వజ్రాలు ,బంగారపు ఆభరణాలు నువ్వు వేసుకో.నాకు సర్పాలు ఆభరణం గ చాలు.
పూర్ణిమ వల్ల వచ్చే వెన్నెల ను చూసి నువ్వు ఆనందించు . నాకు అమావాస్య ముందర చతుర్దశి నాకు ఇవ్వు .చక్కటి
పాలు నిచ్చే గోవును నీవు తీసుకో .నాకు ఎద్దును వాహనం గా ఇవ్వు" అన్నారుట. దైవ ప్రేమ యెంత గొప్పది.
తను సృష్టించిన జీవుల మీద యెంత ప్రేమ. మనం గూడ త్యాగం, ప్రేమ,మంచి వాతావరణం, దాన గుణం ,భూత దయ,
మొదలగు మంచి సంస్కరమంతమైన సాంప్రదాయాలను అలవరచు కోవాలి.మంచి పురాణ గ్రంధాలను చదివి
అర్ధం చేసుకొని, మన పిల్లలకు చెప్పి మంచి సాంప్రదాయాలకు నేలబెట్టండి. శ్రుష్టి కర్త ప్రేమను గుర్తించండి.
మనతో మనం పోయిన తర్వాత మన వెంట వచ్చేవి -మనం చేసిన పుణ్య కార్యాలు ,దాన గుణం, లేక చేసిన పాపం.
అందుకే ................దైవ ప్రేమ ను మరువ కండి ....ప్లీజ్.
భగవంతుడా... నీ శ్రుష్టి ని కాపాడు తండ్రి .........
తిలక్ పండ్రంగి.

19, మార్చి 2009, గురువారం

satsamgatyam

satsamgam


సత్సంగం అనగా మంచి మనసులు గల మంచి మనుషులు చక్కటి వాతావరణం లో మంచి విషయాలు గురుంచి

వారి అభిప్రాయాలూ, వారి అనుభవాలు తెలియపరచటం . దీని వల్ల మనకు తెలియని చాల విషయాలు

తెలుసుకోవచ్చు. దీని వల్ల మన జ్ఞాన సంపద పెరుగుతుంది. మంచి వాతావరణం లో జరిగె ఈ సత్సంగం వల్ల మన

మనసులు అయుహ్ ఆరోగ్యం తో పాటు ఆనందం కలుగు తుంది గదా . ఏ మతం వారైనా సత్సంగం లో పాల్గొని దాని లో ఉన్న మంచి విషయాలుని తియ్యని అమృతం లా గ్రోలి ఆచరిస్తే తమకు ,తమ కుటుంబాలకు మంచి చేసినవారు

అవుతారు. భగవంతుడు శ్రుష్టి చే శ్రుష్టించబడిన ఈ దేహం మంచి పనులు అనగా దానం,క్షమా గుణం ,ఉపకారం,
ప్రేమ ,శ్రుష్టి కర్త పైన భక్తి ,అహింస ,భూత దయ ,సత్యమ్,ధర్మము గా ప్రవర్తిస్తే దైవం మనలను సర్వదా కాపాడుతాడని
సత్సంగం వల్ల తెలుస్తూంది.
సత్సంగం యెంత గొప్పదో తెలుసుకుందాం :
భూమండలమంతటిని ఆది శేషుడు తన పడగల పైన మోస్తున్నదుట ఒకానొక సమయం లో.ఒక నాడు రాజరిషి
విశ్వామిత్రుడు ఆది శేషుని చూసి " ఎందుకు భూమండలమును ఇంత కష్ట పడి మోస్తున్నావు? నేను నా తపః
శక్తి చే భూమి ని క్రిందకు పడకుండా ఆపగలను " అని ఆది శేషువు తో పలికెను .అయితే ఆది శేషువు "రాజ రిషీ-
ఇంత బరువైన భూమి ని మీకు ఒక లిప్త కాలము పాటు నేను నా శిరస్సు పైనుంచి వదిలినా ప్రళయం వస్తుంది (భూమి
క్రిందకు వేగంగా పడిపోవటం వల్ల ) అనెను." అప్పుడు రిషి చిరునవ్వుతో " ఆది శేషా -నువ్వు బూమి ని వదిలి బయటకు రమ్ము.నేను నా తపః శక్తి తో ఆపగలను అని" పలికెను.కొంత సేపు తర్కం జరిగిన పిమ్మట , అది శేషువు ఒక లిప్త
కాలము వదులుటకు అంగీకరించెను .వెంటనే శేషువు భూమి ని వదిలి రిషి దగ్గరకు వచ్చెను .రిషి తన తపః శక్తి ని
ఉపయోగించి భూమిని ఆపటానికి ప్రయత్నించెను.రిషి తపః శక్తీ అంతనూ ఉపయోగించిననూ , భూమి నిలబడ క
క్రింద కు దిగ సాగేను.రిషి కి ఏమి చేయవలెనో భోధ పడలేదు .అంతట శేషువు " రిషి వర్యా -తపః శక్తి విఫలము అయినది కదా.మీరు మహా మునులు .మీ దగ్గర సత్సంగత్యం వల్ల సంపాదించిన పుణ్యం ఏమైనా ఉంటే ,దానం చేయండి . దాని వల్ల భూమి దిగకుండా వుంటుంది "అనెను. రిషి తన మనసులో "అయ్యో-నేను ఎవరితో నూ సత్సాంగత్యం
చేయలేదు గదా.నాకు ఆ పుణ్య ఫలం ఎక్కడ నుంచి వస్తుంది ? అనుకొనెను .తను మనసులో మళ్లీ ఎప్పుడైనా తన
తోటి రిషి ల తో శాంతం గ గాని ,మంచి విషయములు తెలుసుకొంటాం లో వినయం గ ఉండి జ్ఞాన సంపద ఏమైనా
శాంతముగా ,మంచి మనసుతో సత్ సాంగత్యం చేసానా " అని తీవ్రమగా ఆలోచించ సాగేను.అంతలో వశిష్ట ముని తో
తను రాజు గ ఉన్నా కాలంలో సత్సంగత్యం ఒక లిప్త కాలము జరిగెనుట .వెంటనే శేషువు తో ఈ విషయం చెప్పి
లిప్త కాలములో సంపాదించిన సాంగత్య ఫలం ,భూమి గురుంచి మంత్ర మహిమ తో వదిలెను . భూమి గూడ
రిషి సంపాదించి వదిలినా పుణ్య ఫలమును సేఖరించి ఒక లిప్త కాలము ఆగెను . సాంగత్య పుణ్యం ఎంత శక్తీ
వంత మైనదో కదా.
మంచి ని కాపాడండి.సత్ సంప్ర దయలకు విలవలివ్వండి.స్త్రీలు,వృద్చులు,పిల్లలు nu kapadandi . manchi
grandhalanu chadivi aacharinchandi. meeku telisina manchini andaruku panchandi.l

shanthi shanthi shanthi hi.

tilak pandrangi